Home న్యూస్ ఆన్​ లైన్​ లో ఎల్ఆర్ఎస్​ సేవలు ప్రారంభం

ఆన్​ లైన్​ లో ఎల్ఆర్ఎస్​ సేవలు ప్రారంభం

poster on LRS
ఎల్ఆర్ఎస్ స్కీమ్ పోస్టర్ రిలీజ్ చేస్తున్న మంత్రి కేటీఆర్

ఎల్ఆర్ఎస్ స్కీమ్ ఆన్ లైన్ సేవలను రాష్ట్ర  పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్​ (ఎల్ఆర్ఎస్​)ను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఇప్పటి వరకు  అనధికారిక లేఅవుట్లలో తెలియక  ఫ్లాట్ లను కొనుగోలు చేసిన వారు ఎల్ఆర్ఎస్​  సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

సోమవారం ఎల్ఆర్ఎస్​ స్కీమ్​ ఆన్​లైన్​, మీ సేవ సర్వీసులను మంత్రి కేటీఆర్​ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎల్ఆర్ఎస్​ సంబంధించిన అంశాలపై ప్రజా అవగాహన కోసం రూపొందించిన ఆ పోస్టర్​ ను మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్​ మాట్లాడుతూ పట్టణ ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటి వరకు ఉన్న అనధికారిక ప్లాట్లు, లేఅవుట్ల క్రమబద్దీకరణకు ఇదే మంచి అవకాశమని ఆయన తెలిపారు. ఈ ఏడాది అక్టోబర్​ 15వ తేదీ వరకు అందుబాటులో ఉన్న ఎల్ఆర్ఎస్​ స్కీమ్​ ద్వారా భూ యజమానులు పూర్తిస్థాయి హక్కులను పొందడంతో పాటు ప్రభుత్వ పరంగా అన్ని రకాల మౌలిక సదుపాయాలను పొందడానికి అర్హులవుతారని వివరించారు.

వచ్చే అక్టోబర్ 15 వ తేదీ వరకు గడువు లోగా  దరఖాస్తు చేసుకున్న వారు క్రమబద్ధీకరణ ఫీజును వచ్చే ఏడాది (2021) జనవరి 31వ తేదీ లోగా పూర్తిగా చెల్లించాల్సి ఉంటుందన్నారు.

ప్రభుత్వ స్థలాలకు,  అర్బన్ ల్యాండ్ సీలింగ్​ మిగులు భూములకు, దేవాదాయ భూములకు, చెరువుల శిఖం భూములు లలో ఉన్న ప్లాట్లకు ఎల్ఆర్ఎస్​ స్కీమ్​ వర్తించదని మంత్రి కేటీఆర్​  స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్​ శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్​ కుమార్​, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి కె. రామకృష్ణారావు, వాటర్​ వర్క్స్​ మేనేజింగ్​ డైరెక్టర్​  ఎం.దానకిషోర్​ తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version