Home మనీ 3 రోజుల వరుస నష్టాల తరువాత ఎగబాకిన మార్కెట్లు

3 రోజుల వరుస నష్టాల తరువాత ఎగబాకిన మార్కెట్లు

stock markets
Photo by Lorenzo from Pexels

స్టాక్ మార్కెట్లు 3 రోజుల నష్టాలను అధిగమించిన తరువాత సానుకూలంగా ముగిశాయి. నిఫ్టీ 55.85 పాయింట్లు పెరిగి 8879.10 వద్ద ముగియగా, సెన్సెక్స్ 167.19 పాయింట్లు పెరిగి 30196.17 వద్ద ముగిసింది. భారతీ ఎయిర్‌టెల్ 11% పెరుగుదలతో నిఫ్టీలో అగ్రస్థానంలో నిలిచింది.

టాప్ గెయినర్స్ అండ్ లూజర్స్

ఐటి, మెటల్, ఎఫ్‌ఎంసిజి, ఆటో రంగాలు నిఫ్టీలో 0.75 నుండి 1.2 శాతం మధ్య పెరుగుదల నమోదు చేసుకున్నాయి. భారతీ ఎయిర్‌టెల్ యొక్క స్టాక్ 11% పెరిగి, మార్కెట్ ధర రూ. 596.20 వద్ద ముగిసింది. ఐటీసీ 3.64 శాతం పెరిగి రూ. 170.75 వద్ద ముగిసింది.

పవర్ గ్రిడ్ 2.33 శాతం పెరిగి రూ. 158.10 వద్ద ముగిసింది, జేఎస్‌డబ్ల్యు స్టీల్ (3.83%), ఒఎన్‌జిసి (5.69%), అదానీ పోర్ట్స్ (9%), అల్ట్రాటెక్ సిమెంట్ (4.15%), మరియు ఎన్‌టిపిసి (2.19%) వద్ద ముగిశాయి.

ఈ రోజు నిఫ్టీ మార్కెట్లో నష్టపోయిన వాటిలో వేదాంత, రిలయన్స్ ఇండస్ట్రీస్, లార్సెన్ &టూబ్రో, సిప్లా, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌యూఎల్, ఎస్‌బీఐ మరియు యూపీఎల్ ఉన్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ సెషన్ ముగిసే సమయానికి తన లాభాలను వదులుకుంది. 2.26 శాతం తగ్గి 1,408.15 వద్ద ముగిసింది. ఈ సంస్థ తన రైట్స్ ఇష్యూను బుధవారం ప్రారంభించింది.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 0.59 శాతం తగ్గి 831.50 రూపాయల వద్ద ముగియగా, హిందుస్తాన్ యూనిలీవర్ 1.56 శాతం తగ్గి 1974.50 రూపాయల వద్ద ముగిసింది.

పెరుగుదలకు దోహదపడిన టెలికామ్ రంగం

కోవిడ్-19 కారణంగా దేశం మొత్తం లాక్ డౌన్లో ఉంది. ప్రజలు ఇళ్లలో చిక్కుకుపోయారు. మొబైల్ పరికరాల్లో నిమగ్నమయ్యారు. డేటా ప్లాన్స్ వినియోగం పెరిగిపోయింది. మొబైల్ టారిఫ్‌లు, డేటా ప్లాన్‌ల కోసం  వినియోగదారుల సగటు వ్యయం 25 శాతం పెరిగింది. దీంతో టెలికామ్ రంగం ఊపందుకుంది.

మార్కెట్ మనోభావాలపై లాక్ డౌన్ పొడిగింపు ప్రభావం

పెరుగుతున్న కోవిడ్-19 కేసులను పరిష్కరించడానికి లాక్ డౌన్ పొడిగింపు ప్రకటన మార్కెట్ పరిస్థితిని మరింత దిగజార్చింది. ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీపై పెట్టుబడిదారులు కూడా నిరాశ చెంది, పతనాన్ని ఆశిస్తున్నారు. దీని ఫలితంగా, బ్యాంకులు మరియు ఎన్‌బిఎఫ్‌సీ షేర్లు బాగా పడిపోయాయి. నిఫ్టీ పిఎస్‌యూ బ్యాంక్ సూచీ తీవ్రంగా దెబ్బతిన్నది. 2.6% పతనాన్ని చవిచూసింది.

కోవిడ్-19 వ్యాక్సిన్ వైద్య ప్రయోగాలు ప్రపంచ మార్కెట్లను ప్రభావితం చేశాయి

అమెరికాలోని వ్యాక్సిన్ ప్రయోగాల పట్ల ప్రపంచ మార్కెట్లు మార్కెట్లు సానుకూలంగా స్పందిస్తున్నాయి. దీంతో నాస్డాక్ 2.44% పెరిగింది. నిక్కీ 1.49% పెరుగుదలను, హాంగ్ సెంగ్ 1.89% పెరుగుదలను ప్రదర్శించాయి. ప్రపంచ మార్కెట్లలో సానుకూల ధోరణి భారత మార్కెట్‌పై సానుకూల ప్రభావాన్ని చూపింది. బలహీనపడిన డాలర్ సూచిక మార్కెట్ పనితీరుపై మరింత సానుకూల ప్రభావాన్ని చూపింది.

అయినా కూడా, ఈ ప్రయోగాలన్నీ ఇంకా ప్రారంభ దశలో ఉన్నందున పెరుగుదల అనేది తాత్కాలికం కావచ్చు. వైరస్ కు సంబంధించిన ఆందోళనలు భారత మార్కెట్లపై ప్రతికూల ప్రభావాన్ని కొనసాగిస్తున్నాయి.

Amar deo Singh
 అమర్ దేవ్ సింగ్, హెడ్ అడ్వయిజరీ, ఏంజెల్ బ్రోకింగ్

Exit mobile version