Home న్యూస్ కరోనా మరణాలు లక్షన్నర.. రోజూ 80 వేలకు పైగా కొత్త కేసులు

కరోనా మరణాలు లక్షన్నర.. రోజూ 80 వేలకు పైగా కొత్త కేసులు

0
కరోనా మరణాలు లక్షన్నర.. రోజూ 80 వేలకు పైగా కొత్త కేసులు
Photo by Markus Spiske from Pexels

కరోనా మరణాలు 1,52,551 కు చేరుకున్నాయి. ఇవి ఏప్రిల్‌ 19 రాత్రి 9.30 గంటల సమయానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన నివేదికలోని గణాంకాలు. ఇదే సమయానికి ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ 19 పాజిటివ్‌ కేసులు 22,41,359 గా నమోదయ్యాయి.

మార్చి 6వ తేదీన 1,01,254 కేసులు ఉండగా.. ఈ 43 రోజుల్లో మరో 21.40 లక్షల కేసులు నమోదయ్యాయి. అంటే సగటున రోజుకు 50 వేల కొత్త కేసులు. కానీ ఇటీవల రోజుకు సగటున 80 వేలకు పైగా కేసులు నమోదవుతుండడం కలవరపెడుతోంది.

ఏప్రిల్‌ ఒకటి నుంచి సగటున రోజుకు 70 వేల మేర కొత్తగా కోవిడ్ 19 కేసులు వస్తున్నాయి. ఏప్రిల్‌ 11న ఒకేరోజు అత్యధికంగా 90,778 కేసులు కొత్తగా వచ్చాయి. ఏప్రిల్‌ 17న ప్రపంచవ్యాప్తంగా ఒకే రోజు అత్యధికంగా 8,478 కరోనా మరణాలు సంభవించాయి.

భారత దేశంలో ఏప్రిల్‌ 19 రాత్రి 9.30 గంటల సమయానికి దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసులు 15,712 నమోదైనట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఇందులో 1334 కేసులు కొత్తగా నమోదైనట్టు తెలిపింది.

అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశాలు (ఏప్రిల్‌ 19 రాత్రి 9.30 గంటల సమయానికి)

దేశం               పాజిటివ్‌ కేసులు               కరోనా మరణాలు
అమెరికా              6,95,353                32,427
స్పెయిన్‌              1,91,726                20,043
ఇటలీ                 1,75,925                23,227
జర్మనీ                1,39,897                  4,294
యూకే                1,14,221                15,464
ఫ్రాన్స్‌                 1,10,721                19,294
చైనా                     84,201                  4,642
టర్కీ                     82,329                  1,890
ఇరాన్‌                   80,868                  5,031
రష్యన్‌ ఫెడరేషన్‌        42,853                      361
బెల్జియం                37,183                   5,453
బ్రెజిల్‌                   33,682                   2,141

ఇవి కూడా చదవండి

కరోనాపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెబుతోంది

కరోనా నేర్పిన పది జీవిత పాఠాలు ఇవే


Discover more from Dear Urban

Subscribe to get the latest posts sent to your email.

Previous article వెబ్‌ సిరీస్ః ఫోర్‌ మోర్‌ షాట్స్‌ ప్లీజ్‌ సీజన్‌ 2 రివ్యూ
Next article లాక్‌డౌన్ ఎత్తి వేస్తే .. ఈ పిట్ట కథ నిజమవుతుందా?
డియర్ అర్బన్ డెస్క్ అనుభవజ్ఞులైన జర్నలిస్టులు, కంటెంట్ ఎడిటర్లు, రీసెర్చ్ నిపుణులతో కూడిన సంపాదక బృందం. సమాజానికి ఉపయోగపడే, నమ్మకమైన, పరిశోధనాత్మక సమాచారాన్ని అందించడం ఈ బృందం ప్రధాన లక్ష్యం. ఈ బృందం సభ్యులకు కలిపి 20 సంవత్సరాలకు పైగా జర్నలిజం అనుభవం ఉంది. ఆర్థికం, జీవనశైలి, విద్య, ఆరోగ్యం, టెక్నాలజీ, ఉద్యోగాలు, సామాజిక అంశాలపై లోతైన అవగాహనతో కథనాలు రూపొందిస్తారు. డియర్ అర్బన్ డెస్క్ ప్రచురించే ప్రతి కథనం కచ్చితత్వం, విశ్వసనీయత, పాఠకులకు ఉపయోగకరమైన సమాచారాన్ని దృష్టిలో పెట్టుకుని రూపొందుతుంది. ప్రచురణకు ముందు అన్ని కథనాలు ఫాక్ట్ చెక్, ఎడిటోరియల్ రివ్యూ ప్రక్రియ ద్వారా ధృవీకరణ తనిఖీ ఉంటుంది. పాఠకులకు సరళమైన భాషలో క్లిష్టమైన అంశాలను అర్థమయ్యేలా వివరించడం డియర్ అర్బన్ డెస్క్ ప్రత్యేకత. సమాజంలో జరుగుతున్న మార్పులు, ట్రెండ్స్, ప్రజలకు ఉపయోగపడే సమాచారం వేగంగా అందించడం ఈ బృందం ముఖ్య ధ్యేయం. డియర్ అర్బన్ డెస్క్ లక్ష్యం — నమ్మకమైన సమాచారం ద్వారా పాఠకుల జీవితాన్ని మెరుగుపరచడం.