Home న్యూస్ RPF Jobs: రైల్వేలో 4,660 ఆర్పీఎఫ్ జాబ్స్.. పోలీస్ ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేషన్

RPF Jobs: రైల్వేలో 4,660 ఆర్పీఎఫ్ జాబ్స్.. పోలీస్ ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేషన్

0
RPF Jobs: రైల్వేలో 4,660 ఆర్పీఎఫ్ జాబ్స్.. పోలీస్ ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేషన్
రైల్వే పోలీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

RPF Jobs: రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ అభ్య‌ర్థుల‌కు మ‌రో జాబ్ నోటిఫికేష‌న్ వ‌చ్చేసింది. మొత్తం 4,660 ఉద్యోగాలను రైల్వే శాఖ భ‌ర్తీ చేయ‌నుంది. ఆస‌క్తి గ‌ల అభ్య‌ర్థులు మే 14 వ‌ర‌కూ దర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ఈ నోటిఫికేష‌న్ ద్వారా రైల్వే ప్రోటెక్ష‌న్ ఫోర్స్ (RPF)లో 4,660 ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల భ‌ర్తీకి ఆన్‌లైన్‌లో దర‌ఖాస్తు స్వీక‌ర‌ణ మొద‌లైంది. ఏప్రిల్ 15 నుంచి మే 14 వ‌ర‌కూ దర‌ఖాస్తు చేసుకోవ‌డానికి అవ‌కాశం క‌ల్సించింది.

ఆర్పీఎఫ్ జాబ్స్ నోటిఫికేష‌న్‌ వివరాలు ఇవే

4,660 పోస్టుల‌లో 4,208 కానిస్టేబుల్ ఉద్యోగాలు, 425 ఎస్పై ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. కానిస్టేబుల్ ఉద్యోగాల‌కు ప‌దో త‌ర‌గ‌తి, ఎస్సై ఉద్యోగాల‌కు  డిగ్రీ ఉత్తీర్ణ‌త ఉండాలి. కానిస్టేబుల్ ఉద్యోగాల‌కు దర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థుల‌కు 2024 జూలై 1 నాటికి 18 – 28 ఏళ్ల వయస్సు ఉండాలి. ఎస్సై అభ్య‌ర్థ‌ల‌కు 20-28 ఏళ్ల మ‌ధ్య వయస్సు ఉండాలి. విభిన్న వ‌ర్గాల అభ్యర్థులకు గరిష్ట వ‌యోపరిమితిలో స‌డ‌లింపు ఇచ్చారు.

దర‌ఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, ఎక్స్-స‌ర్వీస్‌మెన్, మ‌హిళ‌లు, ట్రాన్స్‌జెండ‌ర్, మైనారిటీ, ఈబీసి అభ్య‌ర్థులకు రూ. 250. ఇత‌రుల‌కు రూ. 500. 

ఎంపిక ప్ర‌క్రియ: ఆన్‌లైన్ రాత‌ప‌రీక్ష, ఫిజిక‌ల్ ఎఫిషియ‌న్సీ, ఫిజిక‌ల్ మెజ‌ర్‌మెంట్ త‌దిత‌ర ప‌రీక్ష‌ల ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ ఉంటుంది.

వేత‌నం: ఎస్సై ఉద్యోగాల‌కు రూ. 35,400, కానిస్టేబుల్ ఉద్యోగాల‌కు రూ. 21,700 ప్లస్ భత్యాలు ఉంటాయి.

ప‌రీక్ష తేదీలు, ప‌రీక్ష కేంద్రాలు, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్టు రీజియ‌న్ల వారీగా ఖాళీల సంఖ్య‌, ఇత‌ర‌త్రా వివ‌రాల‌ను ఇంకా తెల‌పాల్సి ఉంది.


Discover more from Dear Urban

Subscribe to get the latest posts sent to your email.

Previous article Summer Precautions: వేస‌విలో ఈ నీరు తాగుతున్నారా? ఆరోగ్యానికి ఇలాంటి జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి!
Next article రూ. 69,999లకే ఓలా ఎలక్ట్రిక్ ఎస్ 1 ఎక్స్ స్కూటర్.. ఈ శ్రేణితో మాస్ మార్కెట్ సెగ్మెంట్
డియర్ అర్బన్ డెస్క్ అనుభవజ్ఞులైన జర్నలిస్టులు, కంటెంట్ ఎడిటర్లు, రీసెర్చ్ నిపుణులతో కూడిన సంపాదక బృందం. సమాజానికి ఉపయోగపడే, నమ్మకమైన, పరిశోధనాత్మక సమాచారాన్ని అందించడం ఈ బృందం ప్రధాన లక్ష్యం. ఈ బృందం సభ్యులకు కలిపి 20 సంవత్సరాలకు పైగా జర్నలిజం అనుభవం ఉంది. ఆర్థికం, జీవనశైలి, విద్య, ఆరోగ్యం, టెక్నాలజీ, ఉద్యోగాలు, సామాజిక అంశాలపై లోతైన అవగాహనతో కథనాలు రూపొందిస్తారు. డియర్ అర్బన్ డెస్క్ ప్రచురించే ప్రతి కథనం కచ్చితత్వం, విశ్వసనీయత, పాఠకులకు ఉపయోగకరమైన సమాచారాన్ని దృష్టిలో పెట్టుకుని రూపొందుతుంది. ప్రచురణకు ముందు అన్ని కథనాలు ఫాక్ట్ చెక్, ఎడిటోరియల్ రివ్యూ ప్రక్రియ ద్వారా ధృవీకరణ తనిఖీ ఉంటుంది. పాఠకులకు సరళమైన భాషలో క్లిష్టమైన అంశాలను అర్థమయ్యేలా వివరించడం డియర్ అర్బన్ డెస్క్ ప్రత్యేకత. సమాజంలో జరుగుతున్న మార్పులు, ట్రెండ్స్, ప్రజలకు ఉపయోగపడే సమాచారం వేగంగా అందించడం ఈ బృందం ముఖ్య ధ్యేయం. డియర్ అర్బన్ డెస్క్ లక్ష్యం — నమ్మకమైన సమాచారం ద్వారా పాఠకుల జీవితాన్ని మెరుగుపరచడం.