Home హెల్త్ రెమ్డెసివిర్ ఇంజెక్షన్ క్లినికల్ ట్రయల్స్ సానుకూలం

రెమ్డెసివిర్ ఇంజెక్షన్ క్లినికల్ ట్రయల్స్ సానుకూలం

0
రెమ్డెసివిర్ ఇంజెక్షన్ క్లినికల్ ట్రయల్స్ సానుకూలం
Image by <a href="https://pixabay.com/users/Dimhou-5987327/?utm_source=link-attribution&utm_medium=referral&utm_campaign=image&utm_content=4967171">Dimitri Houtteman</a> from <a href="https://pixabay.com/?utm_source=link-attribution&utm_medium=referral&utm_campaign=image&utm_content=4967171">Pixabay</a>

కోవిడ్ -19కు చికిత్సగా రెమ్డెసివిర్ ఇంజెక్షన్ క్లినికల్ ట్రయల్స్ సానుకూల ఫలితాలను ఇచ్చినట్టు అమెరికా కంపెనీ గిలియాడ్ సైన్సెస్ (gilead sciences) ప్రకటించింది. ఎబోలా వైరస్ చికిత్సలో వాడే ఈ రెమ్ డెసివిర్ (remdesivir) ఇంజెక్షన్ ను కోవిడ్-19 వ్యాధికి నేరుగా ఉపయోగించే ఔషధంగా గిలియాడ్ సైన్సెస్ కంపెనీ క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తోంది.

ఐదు రోజుల డోసెజ్, పది రోజుల డోసెజ్ చికిత్స విధానంలో పరీక్షించామని, రెమ్డెసివిర్ కోవిడ్ వైరస్ ను నియంత్రించడంలో సానుకూల ఫలితాలు వెలువడ్డాయని బుధవారం ఆ కంపెనీ వెల్లడించింది. ఇప్పటివరకు 397 మంది కోవిడ్ పేషెంట్లపై ట్రయల్స్ చేసినట్టు కంపెనీ తెలిపింది.

యూఎస్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అలర్జీ అండ్ ఇన్ఫెక్చువస్ డిసీజెస్ ఈ యాంటీ వైరల్ మెడిసిన్ ను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. అనుమతులు లభిస్తే ట్రీట్ మెంట్ ప్రోటో కాల్ లో రెడ్ మెసివిర్ చేరుతుంది.

10 రోజుల పాటు ఈ ఇంజెక్షన్ ను ఇస్తే వెంటిలేటర్ సహాయం లేకుండానే తీవ్ర న్యూమోనియో నుంచి రోగులు కోలుకున్నట్టు గిలిడియా ప్రకటించింది.

కోవిడ్-19 కు నేరుగా పనిచేసే చికిత్సా విధానం సక్సెస్ అవడంతో అమెరికా షేర్ మార్కెట్ కోలుకుంది. సదరు కంపెనీ షేర్లు 9 శాతం మేర పెరిగాయి.

ప్రస్తుతం ఒక ఇంజెక్షన్ ధర రూ. 76 పలుకుతోందని సమాచారం. ప్రపంచ దేశాలు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో దీని ధర మరింత తగ్గే అవకాశం ఉంటుంది.

ఇవి కూడా చదవండి

కరోనా లాక్ డౌన్ నేర్పిన పది జీవిత పాఠాలు


Discover more from Dear Urban

Subscribe to get the latest posts sent to your email.

Previous article ఫ్రీ మూవీస్‌ ఆన్‌లైన్‌ సైట్స్‌ ఏవో తెలుసా?
Next article IVF process: ఐవీఎఫ్ ఎప్పుడు? ఎందుకు? ఎలా? ఖర్చెంత? రిస్క్ ఏంటి?
డియర్ అర్బన్ డెస్క్ అనుభవజ్ఞులైన జర్నలిస్టులు, కంటెంట్ ఎడిటర్లు, రీసెర్చ్ నిపుణులతో కూడిన సంపాదక బృందం. సమాజానికి ఉపయోగపడే, నమ్మకమైన, పరిశోధనాత్మక సమాచారాన్ని అందించడం ఈ బృందం ప్రధాన లక్ష్యం. ఈ బృందం సభ్యులకు కలిపి 20 సంవత్సరాలకు పైగా జర్నలిజం అనుభవం ఉంది. ఆర్థికం, జీవనశైలి, విద్య, ఆరోగ్యం, టెక్నాలజీ, ఉద్యోగాలు, సామాజిక అంశాలపై లోతైన అవగాహనతో కథనాలు రూపొందిస్తారు. డియర్ అర్బన్ డెస్క్ ప్రచురించే ప్రతి కథనం కచ్చితత్వం, విశ్వసనీయత, పాఠకులకు ఉపయోగకరమైన సమాచారాన్ని దృష్టిలో పెట్టుకుని రూపొందుతుంది. ప్రచురణకు ముందు అన్ని కథనాలు ఫాక్ట్ చెక్, ఎడిటోరియల్ రివ్యూ ప్రక్రియ ద్వారా ధృవీకరణ తనిఖీ ఉంటుంది. పాఠకులకు సరళమైన భాషలో క్లిష్టమైన అంశాలను అర్థమయ్యేలా వివరించడం డియర్ అర్బన్ డెస్క్ ప్రత్యేకత. సమాజంలో జరుగుతున్న మార్పులు, ట్రెండ్స్, ప్రజలకు ఉపయోగపడే సమాచారం వేగంగా అందించడం ఈ బృందం ముఖ్య ధ్యేయం. డియర్ అర్బన్ డెస్క్ లక్ష్యం — నమ్మకమైన సమాచారం ద్వారా పాఠకుల జీవితాన్ని మెరుగుపరచడం.