Home ట్రావెల్ జూన్ 1 నుంచి నడిచే ట్రైన్స్ లిస్టు ఇదే

జూన్ 1 నుంచి నడిచే ట్రైన్స్ లిస్టు ఇదే

0
జూన్ 1 నుంచి నడిచే ట్రైన్స్ లిస్టు ఇదే
Image Source: ministry of railways

జూన్ 1 నుంచి నడిచే ట్రైన్స్ కు రైల్వే శాఖ బుకింగ్ ఈరోజు ఉదయం 10 గంటల నుంచి ప్రారంభించనుంది. ఐఆర్సీటీసీ వెబ్ సైట్ నుంచి, మొబైల్ యాప్ నుంచి టికెట్లు బుక్ చేసుకోవచ్చు. మొత్తం 100 జతల (రాను పోను కలిపి 200 రైళ్లు) రైళ్లను జూన్ 1 నుంచి అందుబాటులోకి తేనుంది. 

ఇప్పటికే మే 12 నుంచి 15 జతల ట్రైన్లు నడుపుతున్న రైల్వే శాఖ వాటికి అదనంగా వీటిని జోడించింది. మే 12 నుంచి నడుస్తున్న ప్రత్యేక రైళ్లన్నీ రాజధాని రైళ్ల కావడంతో అందులో డైనమిక్ ఛార్జీలు వసూలు చేశారు. అంటే సీట్లు భర్తీ అవుతున్న కొద్దీ టికెట్ ధర పెరుగుతుంది. విమాన ఛార్జీల తరహాలో అన్నమాట. 

ప్రత్యేక రైళ్లకు వారం రోజుల ముందు మాత్రమే బుక్ చేసుకోవచ్చు. కానీ జూన్ 1 నుంచి నడిచే రైళ్లకు 30 రోజులు ముందుగా కూడా బుక్ చేసుకోవచ్చు. కేవలం ఈటికెటింగ్ పద్దతుల్లో మాత్రమే బుక్ చేసుకోవచ్చు. రిజర్వేషన్ కౌంటర్లు ఉండవు. అలాగే తత్కాల్, ప్రీమియం తత్కాల్ వెసులుబాటు కూడా ఉండదు. 

కన్ఫర్మ్ టికెట్ ఉన్నవారిని మాత్రమే స్టేషన్ లోకి అనుమతిస్తారు. గంటన్నర ముందే స్టేషన్ కు చేరుకోవాల్సి ఉంటుంది. 

రోజూ నడిచే ముఖ్యమైన రైళ్ల వివరాలు

ముంబై – హైదరాబాద్ మధ్య హుస్సేన్ సాగర్ ఎక్స్ ప్రెస్

హౌరా – సికింద్రాబాద్ మధ్య ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్

హైదరాబాద్ – న్యూఢిల్లీ మధ్య తెలంగాణ ఎక్స్ ప్రెస్

విశాఖ పట్నం – విశాఖపట్నం మధ్య ఏపీ ఎక్స్ ప్రెస్

సికింద్రాబాద్ – గుంటూరు మధ్య గోల్కొండ ఎక్స్ ప్రెస్

తిరుపతి – నిజామాబాద్ మధ్య రాయలసీమ ఎక్స్ ప్రెస్

హైదరాబాద్ – విశాఖపట్నం మధ్య గోదావరి ఎక్స్ ప్రెస్

దానాపూర్ – సికింద్రాబాద్ మధ్య దానాపూర్ ఎక్స్ ప్రెస్

ముంబై – భువనేశ్వర్ మధ్య కోణార్క్ ఎక్స్ ప్రెస్

వారానికి రెండు సార్లు నడిచే రైళ్లు

సికింద్రాబాద్ – హజ్రత్ నిజాముద్దీన్ (ఢిల్లీ)

హౌరా – విజయవాడ – యశ్వంత్ పురా మధ్య దురంతో ఎక్స్ ప్రెస్ వారానికి ఐదు రోజులు

జూన్ 1 నుంచి నడిచే ట్రైన్స్ లిస్ట్ కోసం కింది ఫైల్ ను క్లిక్ చేయండి.


Discover more from Dear Urban

Subscribe to get the latest posts sent to your email.

Previous article 25వ తేదీ నుంచి విమాన సర్వీసులు
Next article మీ కలల వేటలో ఫెయిల్యూర్ వెంటాడుతోందా?
డియర్ అర్బన్ డెస్క్ అనుభవజ్ఞులైన జర్నలిస్టులు, కంటెంట్ ఎడిటర్లు, రీసెర్చ్ నిపుణులతో కూడిన సంపాదక బృందం. సమాజానికి ఉపయోగపడే, నమ్మకమైన, పరిశోధనాత్మక సమాచారాన్ని అందించడం ఈ బృందం ప్రధాన లక్ష్యం. ఈ బృందం సభ్యులకు కలిపి 20 సంవత్సరాలకు పైగా జర్నలిజం అనుభవం ఉంది. ఆర్థికం, జీవనశైలి, విద్య, ఆరోగ్యం, టెక్నాలజీ, ఉద్యోగాలు, సామాజిక అంశాలపై లోతైన అవగాహనతో కథనాలు రూపొందిస్తారు. డియర్ అర్బన్ డెస్క్ ప్రచురించే ప్రతి కథనం కచ్చితత్వం, విశ్వసనీయత, పాఠకులకు ఉపయోగకరమైన సమాచారాన్ని దృష్టిలో పెట్టుకుని రూపొందుతుంది. ప్రచురణకు ముందు అన్ని కథనాలు ఫాక్ట్ చెక్, ఎడిటోరియల్ రివ్యూ ప్రక్రియ ద్వారా ధృవీకరణ తనిఖీ ఉంటుంది. పాఠకులకు సరళమైన భాషలో క్లిష్టమైన అంశాలను అర్థమయ్యేలా వివరించడం డియర్ అర్బన్ డెస్క్ ప్రత్యేకత. సమాజంలో జరుగుతున్న మార్పులు, ట్రెండ్స్, ప్రజలకు ఉపయోగపడే సమాచారం వేగంగా అందించడం ఈ బృందం ముఖ్య ధ్యేయం. డియర్ అర్బన్ డెస్క్ లక్ష్యం — నమ్మకమైన సమాచారం ద్వారా పాఠకుల జీవితాన్ని మెరుగుపరచడం.