Home ఎంటర్‌టైన్‌మెంట్‌ కరోనా వైరస్ ‌పై తొలి సినిమాః లాక్‌డౌన్‌లోనే షూటింగ్‌ చేసిన వర్మ

కరోనా వైరస్ ‌పై తొలి సినిమాః లాక్‌డౌన్‌లోనే షూటింగ్‌ చేసిన వర్మ

0
కరోనా వైరస్ ‌పై తొలి సినిమాః లాక్‌డౌన్‌లోనే షూటింగ్‌ చేసిన వర్మ

సంచలన దర్శకుడు రాంగోపాల్‌ వర్మ మరో సంచలనానికి తెరతీశారు. లాక్‌డౌన్‌ కాలంలోనే ‘కరోనా వైరస్‌’ పేరుతో తెలుగు సినిమా నిర్మించారు. ఆగస్త్య మంజు దర్శకత్వంలో లాక్‌డౌన్‌ కాలంలోనే తెరకెక్కించిన ఈ సినిమా ట్రైలర్‌ను మంగళవారం సాయంత్రం తన యూట్యూబ్‌ ఛానల్‌ ఆర్జీవీలో రిలీజ్‌చేశారు.

4.06 నిమిషాల నిడివితో ఉన్న ఈ ట్రైలర్‌ ఆద్యంతం భయపెట్టేలా ఉంది. ఈ సినిమాపై రాంగోపాల్‌ వర్మ ఓ ట్వీట్‌ చేశారు. ‘మా పనిని ఆ దేవుడితోపాటు కరోనా కూడా ఆపలేదని నిరూపించాలనుకున్నాం. ప్రపంచంలోనే కరోనా వైరస్‌పై తీసిన తొలి సినిమా ఇదే. మా నటీనటులు, సాంకేతిక నిపుణులు తమ సృజనను ఆవిష్కరించారు. లాక్‌డౌన్‌లో మా వాళ్లు లాక్‌డౌన్‌ కాలేదు..’ అంటూ ట్వీట్‌ చేశారు.

కరోనా వైరస్‌ దేశంలో ప్రవేశించిన తొలి నాళ్లలో మన భయాందోళనలు ఎలా ఉండేవో ఈ ట్రైలర్‌లో ప్రతిబింబించాయి. ఈ చిత్రంలో శ్రీకాంత్‌ అయ్యంగార్‌ తదితరులు నటించగా డీఎస్సార్‌ సంగీతం అందించారు.

 


Discover more from Dear Urban

Subscribe to get the latest posts sent to your email.

Previous article పవన్‌ కళ్యాణ్‌ బలగం బండి సంజయ్‌కు బలమవుతుందా?
Next article ఈ 4 స్ట్రెస్‌ లక్షణాలు.. ఏ వ్యాధులకు దారితీస్తాయి?
డియర్ అర్బన్ డెస్క్ అనుభవజ్ఞులైన జర్నలిస్టులు, కంటెంట్ ఎడిటర్లు, రీసెర్చ్ నిపుణులతో కూడిన సంపాదక బృందం. సమాజానికి ఉపయోగపడే, నమ్మకమైన, పరిశోధనాత్మక సమాచారాన్ని అందించడం ఈ బృందం ప్రధాన లక్ష్యం. ఈ బృందం సభ్యులకు కలిపి 20 సంవత్సరాలకు పైగా జర్నలిజం అనుభవం ఉంది. ఆర్థికం, జీవనశైలి, విద్య, ఆరోగ్యం, టెక్నాలజీ, ఉద్యోగాలు, సామాజిక అంశాలపై లోతైన అవగాహనతో కథనాలు రూపొందిస్తారు. డియర్ అర్బన్ డెస్క్ ప్రచురించే ప్రతి కథనం కచ్చితత్వం, విశ్వసనీయత, పాఠకులకు ఉపయోగకరమైన సమాచారాన్ని దృష్టిలో పెట్టుకుని రూపొందుతుంది. ప్రచురణకు ముందు అన్ని కథనాలు ఫాక్ట్ చెక్, ఎడిటోరియల్ రివ్యూ ప్రక్రియ ద్వారా ధృవీకరణ తనిఖీ ఉంటుంది. పాఠకులకు సరళమైన భాషలో క్లిష్టమైన అంశాలను అర్థమయ్యేలా వివరించడం డియర్ అర్బన్ డెస్క్ ప్రత్యేకత. సమాజంలో జరుగుతున్న మార్పులు, ట్రెండ్స్, ప్రజలకు ఉపయోగపడే సమాచారం వేగంగా అందించడం ఈ బృందం ముఖ్య ధ్యేయం. డియర్ అర్బన్ డెస్క్ లక్ష్యం — నమ్మకమైన సమాచారం ద్వారా పాఠకుల జీవితాన్ని మెరుగుపరచడం.